Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : రండి... క్రీడా పోటీల్లో పాల్గొనండి అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. నిత్యం ప్రజాసేవలో తలమునకలయ్యే రాజకీయ నేతలకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పోటీలు మార్చి 18 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు ప్రజాప్రతినిధులకు రిలీఫ్ కలిగించడంలో ఎంతో సహాయపడతాయని, అందుకే ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఎమ్మెల్యేలందరినీ కోరానని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించానని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు.
Admin
Studio18 News