Saturday, 22 March 2025 08:18:53 AM
# NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత # Honey Trap: కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు # Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు # Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత.. # తిరుమలలో చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికిచ్చిన 35 ఎకరాలు క్యాన్సిల్.. # Tirumala: నారా దేవాన్ష్​లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్ర‌స్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే? # Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్.. # Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..! # IPL 2025: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే? # Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి.. # Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్.. # పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో # Telangana Assembly: సై అంటే సై.. అసెంబ్లీలో రగడ.. హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి.. # Gold Price: రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఎంతగా పెరుగుతాయో తెలుసా? # MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..! # Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి.. # Tata Car Prices : కొత్త కారు కావాలా? ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..! # Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్.. # McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు.. # Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!

Karnataka: ఏపీకి నాలుగు కర్ణాటక కుంకీ ఏనుగులు

Date : 28 September 2024 11:44 AM Views : 92

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌కు దసరా తర్వాత నాలుగు కుంకీ ఏనుగులు ఇవ్వనున్నట్లు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ప్రకటించారు. వాటి నిర్వహణలో శిక్షణ పొందిన మావటీలను సైతం కొన్నాళ్లపాటు పంపిస్తామని తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అటవీశాఖల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ముఖ్య అతిధులుగా హజరుకాగా, వారి సమక్షంలో కుంకీ ఏనుగులు, పరస్పర సహకార మార్పిడి, స్మగ్లర్లపై నిఘా, ఏకో టూరిజం వంటి ఆరు అంశాల్లో సహకరించుకునేందుకు వీలుగా ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ తో కలిసి మంత్రి ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. గతంలో కర్ణాటక కూడా మదపుటేనుగులతో తీవ్ర సమస్య ఎదుర్కొందని, కుంకీ ఏనుగులను ఉపయోగించి సమస్యను పరిష్కరించుకోగలిగామని చెప్పారు. పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు వాటిని ఏపీకి అందిస్తున్నామని చెప్పారు. స్మగ్లర్ల ఆటకట్టించేందుకు కర్ణాటక ఉపయోగిస్తున్న సాంకేతికతను ఏపీతో పంచుకుంటామని తెలిపారు. ఏకో టూరిజం అభివృద్ధికి సహకరించుకుంటామని పేర్కొన్నారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు వివిధ సందర్బాల్లో వెళ్లినపుడు అక్కడ ప్రజలు ఏనుగుల గుంపులు పంట పొలాల మీద పడుతున్నాయని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలు పోతున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని చెప్పారన్నారు. ఇది కేవలం చిత్తూరు జిల్లాలో కాకుండా, రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా సమస్య ఉందన్నారు. తాను అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రజలకు సంబంధించిన ఈ ఏనుగుల సమస్యను ఎలా అధిగమించాలని అధికారుల సమీక్ష సమావేశంలో అడిగాను. దీనికి వారు ఏనుగుల గుంపులను కంట్రోల్ చేయాలంటే కర్ణాటక వద్ద శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల వల్లనే సాధ్యమని చెప్పారన్నారు. వెంటనే కర్ణాటక అటవీశాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే తో మాట్లాడితే ఆయన మరో మాట లేకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లి సమావేశమయ్యామని చెప్పారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో చర్చించగా సానుకూలంగా స్పందించారన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :