Thursday, 27 March 2025 11:53:03 AM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

అక్రమ బియ్యం పట్టుకునేందుకు బోట్లు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదు... నిజాలు వెలికితీయాలి: షర్మిల

ఇటీవల కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ తనిఖీలు పీడీఎస్ బియ్యం తరలింపు వెనుక పెద్ద మాఫియా ఉందన్న షర్మిల ఇదో జాతీయస్థాయి కుంభకోణం అని వ్యాఖ్యలు నిజాలు నిగ్

Date : 02 December 2024 02:46 PM Views : 87

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొన్నిరోజుల కింద కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలించడం వెనుక పెద్ద మాఫియా ఉందని, ఇదో జాతీయస్థాయి కుంభకోణం అని పేర్కొన్నారు. అక్రమ బియ్యాన్ని పట్టుకునేందుకు బోట్లు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదు... నిజాలు వెలికి తీయాలి... ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల స్పష్టం చేశారు. "పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ప్రజా ప్రతినిధుల హస్తం ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉంది. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుంది! గత మూడేళ్లలో ఏపీలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయింది. దీన్ని బట్టే మన చెక్ పోస్టుల పనితీరు ఎలా ఉందో అంచనా వేయొచ్చు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పోర్టుల వరకు ఎలా వెళుతోంది? గత ప్రభుత్వ పెద్దలకు రైస్ మాఫియాతో లింకులు ఉన్నాయా? ఇందులో మిల్లర్ల చేతివాటం ఉందా? రేషన్ డీలర్ల మాయాజాలమా? ప్రతి రోజు తనిఖీల సంగతేంటి? ఈ నిజాలు వెలికితీయాల్సిన అవసరం ఉంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి. లేకపోతే విచారణ బాధ్యతలు సీబీఐకి అప్పగించండి. ఏపీ అంటే అన్నపూర్ణమ్మ... మనది ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారు. కష్టపడి పంట పండించే రైతుకు కన్నీళ్లు దక్కుతుంటే... బియ్యం అక్రమార్కులకు కాసులు దక్కుతున్నాయి... ఇదీ మన రాష్ట్ర దుస్థితి" అంటూ షర్మిల సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. తన పోస్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేశారు.

Also Read : సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్వల్ప అగ్నిప్రమాదం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :