Thursday, 27 March 2025 01:21:10 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

Samsung Company: తమిళనాడులో శాంసంగ్ కంపెనీని ఏపీకి తరలిస్తున్నారా? ఇందులో నిజమెంత..

Date : 11 October 2024 11:57 AM Views : 48

Studio18 News - ANDHRA PRADESH / : Samsung company Tamilanadu : ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీకి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో మ్యానిఫాక్చరింగ్ యూనిట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, అక్కడ గత నెల రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తమను యూనియన్ గా గుర్తించడంతోపాటు వేతన సవరణ, ఎనిమిది గంటల పని, ఇతర ప్రయోజనాలను కోరుతూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ఆందోళకారులతో కంపెనీ ప్రతినిధులు పలు దఫాల చర్చలు జరిపారు. కొన్ని డిమాండ్లకు అంగీకరించినా.. మరికొన్ని డిమాండ్లపై చర్చకుసైతం కంపెనీ ప్రతినిధులు అంగీకరించలేదు. కార్మికుల ప్రధాన డిమాండ్ యూనియన్ గుర్తింపునకు మాత్రం శాంసంగ్ కంపెనీ ససేమీరా అంది. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి రాష్ట్ర కార్మిక శాఖ కోర్టు ఆదేశాలను అమలు చేస్తుందని హామీ ఇచ్చినప్పటికీ కార్మికులు ఆందోళన విషయంలో వెనక్కి తగ్గలేదు. కార్మికుల ఆందోళనతో శాంసంగ్ యూనిట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. సెప్టెంబర్ 9 నుంచి సమ్మె కొనసాగుతుంది. పలువురు కార్మికులనుసైతం పోలీసులు అరెస్టు చేశారు. కార్మికుల ఆందోళన కారణంగా కంపెనీ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, శ్రీపెరంబుదూర్ ప్లాంట్ ను వేరే రాష్ట్రానికి మార్చే ఆలోచనలో కంపెనీ ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా శ్రీసిటీ అధికారులు శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది. శ్రీసిటీకి కేవలం 75 కిలో మీటర్ల దూరంలోనే తమిళనాడులోని శాంసంగ్ శ్రీ పెరంబుదూర్ ప్లాంట్ ఉంది. శ్రీసిటీ అధికారులు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఆగస్టు నెలలో రూ.3,700 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులను ప్రారంభించి, అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. శ్రీసిటీకి చెందిన అధికారులు మిమ్ములను సంప్రదించారా అని అడిగినప్పుడు శాంసంగ్ ప్రతినిధి దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. తాజాగా ఈ విషయంపై.. శాంసంగ్ ప్రతినిధి బిజినెస్ స్టాండర్డ్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దాదాపు మూడు దశాబ్దాలుగా భారతదేశ వృద్ధి ప్రయాణంలో శాంసంగ్ బలమైన భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవకు కట్టుబడి ఉంది. మేము భారత ప్రభుత్వం, ప్రస్తుతం మేముఉన్న వివిధ రాష్ట్రాలతో కలిసి పని చేస్తూనే ఉంటాము.. మద్దతు ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. శాంసంగ్ కంపెనీ మరో రాష్ట్రానికి మారబోతుందా అనే ప్రశ్నకు తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు సమాధానంమిస్తూ.. తమిళనాడు అన్ని కంపెనీలకు అనుకూలమైన రాష్ట్రం. శాంసంగ్ ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లదు. అలాంటి పరిస్థితికి అవకాశమే లేదని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :