Wednesday, 26 March 2025 05:09:01 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

handloom co operative societies: త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు: మంత్రి సవిత

Date : 24 October 2024 01:49 PM Views : 127

Studio18 News - ANDHRA PRADESH / : చేనేత సహకార సంఘాల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు నిద్రాణ స్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. మంగళగిరిలోని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ కమిషనరేట్‌లో వివిధ జిల్లాలకు చెందిన డీడీలు, ఏడీలతో బుధవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేతలకు ప్రస్తుత ట్రెండ్ తగ్గట్లు శిక్షణ అందజేసి, తయారైన వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పించనున్నామని తెలిపారు. చేనేతలకు క్యాష్ లెస్ వైద్యం అందించేలా బీమా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నామన్నారు. నూలుపై 15 శాతం సబ్సిడీ కూడా అందజేయనున్నామన్నారు. ఇవే కాకుండా 2014-19 మధ్య అమలు చేసిన అన్ని పథకాలనూ చేనేతలకు అందివ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ముద్ర రుణాలపై చేనేత కార్మికులకు వ్యక్తిగత, సామూహిక రుణాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతమున్న టెక్స్ టైల్స్ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు చీరాలలో నూతన టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు పథకాలపై చేనేతలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేనేత కార్మికులు ఎంత మేర నష్టపోయారు అనే విషయాలపై నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ , జేడీ కన్నబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :