Thursday, 12 March 2026 03:34:01 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Temple Chief Priest: తెలంగాణలోని ప్రముఖ ఆలయ ప్రధాన పూజారి, కొడుకుపై లైంగిక వేధింపుల కేసు.. సస్పెన్షన్ వేటు

Date : 20 September 2024 12:20 PM Views : 336

Studio18 News - ANDHRA PRADESH / : తెలంగాణలోని ప్రముఖ ఆలయానికి చెందిన ప్రధాన పూజారి, అదే ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న ఆయన పెంపుడు కుమారుడిని ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు. వరకట్నం, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకున్నట్టు ఎగ్జిక్యూటివ్ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు. ప్రధాన పూజారి కోడలు ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలో వీరిద్దరిపై ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆగస్టులోనే వారిపై తాడేపల్లిగూడెంలో కేసు నమోదైనట్టు రమాదేవి తెలిపారు. తాజాగా ఆ ఎఫ్ఐఆర్ కాపీ తమకు అందిందని, వారిపై లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయని వివరించారు. అర్చకత్వ గౌరవం కాపాడాలన్న ఉద్దేశంతో వారిద్దరినీ సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. ప్రధాన పూజారి, ఆయన కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తాడేపల్లిగూడెం టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎ.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో వారిని కలిసేందుకు వెళితే అందుబాటులో లేరని, త్వరలోనే వారిని విచారిస్తామని తెలిపారు. బాధితురాలు ఆగస్టు 14న ఫిర్యాదు చేసిందని, తనను లైంగికంగా వేధించడంతోపాటు రూ. 10 లక్షల కట్నం తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన పూజారికి మగ పిల్లలు లేకపోవడంతో తన భర్తను కొన్నేళ్ల క్రితం దత్తత తీసుకున్నారని, తాడేపల్లిగూడెంకు చెందిన తనకు అతనితో 2019లో వివాహమైందని ఆమె పేర్కొన్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారని, ఆ తర్వాతి నుంచి వేధించడం మొదలుపెట్టారని ఆరోపించారు. కాగా, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఈవో వారిని సస్పెండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :