Monday, 28 April 2025 06:08:19 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

AP High Court: వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేశ్‌కు హైకోర్టులో ఊరట

Date : 04 October 2024 02:02 PM Views : 68

Studio18 News - ANDHRA PRADESH / : Nandigama Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో జైలులో ఉన్న సురేశ్ కు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు శుక్రవారం మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను మంగళగిరి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును నందిగం సురేశ్ ఆశ్రయించాడు. దీంతో బుధవారం పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పును శుక్రవారంకు రిజర్వు చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సురేశ్ కు బెయిల్ ఇవ్వొద్దని, ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉందని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, గురువారంతో సురేశ్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో గుంటూరు జైలు నుంచి పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బెయిల్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేయడంతో.. కేసును విచారించిన న్యాయమూర్తి మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ పొగించడంతో సురేశ్ ను బందోబస్తు మధ్య గుంటూరు జైలుకు తరలించారు. తాజాగా సురేశ్ బెయిల్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. సురేశ్ తోపాటు వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను సజ్జల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ఏపీ హైకోర్టులో ఈ పిటీషన్ పై విచారణ జరగనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :