Thursday, 15 May 2025 02:01:56 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి: జగన్ పై షర్మిల విసుర్లు

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గైర్హాజరైన జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వెళతాననడం అర్థరహితమన్న షర్మిల పిచ్చితనాన్ని పక్కనబెట్టి అసెంబ్లీ

Date : 11 November 2024 03:51 PM Views : 166

Studio18 News - ANDHRA PRADESH / : ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, వైసీపీ అధినేత జగన్ సభకు గైర్హాజరయ్యారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ తీరు చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుందని ఘాటుగా విమర్శించారు. జనం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికా? అంటూ మండిపడ్డారు. "ప్రజలు మీకు ఓట్లేసింది... అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే సభకు పోతానని మారాం చేయడానికో కాదు! మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది... ఇంట్లో కూర్చుని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు! మీ స్వయంకృతాపరాధమే మిమ్మల్ని ప్రతిపక్షానికి దూరం చేసింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతాననడం మీ అవివేకానికి, మీ అజ్ఞానానికి నిదర్శనం" అంటూ జగన్ ను దుయ్యబట్టారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం అని షర్మిల వివరించారు. "కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కు లేదు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు కావడంలేదు. రాష్ట్రంలో మహిళలపై దాడులు ఆగడంలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందా అరికట్టడంలేదు. ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసే అవకాశాన్ని ప్రజలు వైసీపీకి ఇస్తే , ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం సిగ్గుచేటు. 1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లే వచ్చాయి. అయినప్పటికీ విపక్ష హోదా కావాలని మారాం చేయలేదు. ఆ 26 మంది సభ్యులతోనే అసెంబ్లీలో ప్రజాపక్షంగా కాంగ్రెస్ నిలిచింది. అనేక సమస్యలపై నాడు టీడీపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించింది. ఇక కేంద్రంలో... 2014లో 44 సీట్లు... 2019లో 52 సీట్లే వచ్చినా కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా అడగలేదు. హోదా లేకపోయినా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రజల పక్షాన పోరాడారు. మోదీ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ, దేశ ప్రజల గొంతుకలా కాంగ్రెస్ మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కనబెట్టి అసెంబ్లీకి వెళ్లి, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. ఒకవేళ అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం మీకు లేకపోతే వైసీపీ శాసనసభాపక్షం మొత్త రాజీనామా చేయండి. అప్పుడు ఇంట్లోనే కాదు... ఎక్కడైనా కూర్చుని తీరిగ్గా మాట్లాడుకోండి" అంటూ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు

Also Read : ఎవరు మనవాళ్లు? కష్టాలను మించిన పాఠాల్లేవ్: నటుడు రవి కాలే!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :