Studio18 News - ANDHRA PRADESH / : కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీఐడీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయసాయిని సీఐడీ అధికారులు ఓసారి ప్రశ్నించారు. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు పంపించారు. మార్చి 25న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గత బుధవారం నాడు విజయసాయిరెడ్డిని బెజవాడ సీఐడీ కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఆ సమయంలోనే విజయసాయికి సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు ఫిర్యాదుతో నమోదైన కేసులో విజయసాయి, మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. ఇందులో విజయసాయి ఏ2గా ఉన్నారు.
Admin
Studio18 News