Thursday, 12 March 2026 12:48:11 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Mahesh Chandra Ladda: విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం: ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా

Date : 18 November 2025 06:49 PM Views : 174

Studio18 News - ANDHRA PRADESH / Kakinada : విజయవాడ, కాకినాడలో 31 మంది మావోయిస్టుల అరెస్ట్ ఆటోనగర్‌లో కూలీల వేషంలో తలదాచుకున్న నక్సల్స్ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అగ్రనేతలు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నట్టు సమాచారం ఏఓబీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం పక్కా సమాచారంతోనే అరెస్టులు చేసినట్లు వెల్లడించిన ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. అరెస్ట్ అయిన వారిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. విజయవాడ శివారులోని కానూరు న్యూ ఆటోనగర్‌లో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆ భవనాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఒకేచోట 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం గమనార్హం. వీరంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన కూలీల ముసుగులో ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడ నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యాదర్శి తిప్పిరి తిరుపతి బృందం ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఆటోనగర్‌లోని ఫ్యాక్టరీలు, టింబర్ డిపోలలో ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తుంటారు. ఇదే అదునుగా భావించిన మావోయిస్టులు, వారిలో కలిసిపోయి ఆశ్రయం పొందారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో కలిపి మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్డా అధికారికంగా ప్రకటించారు. గత నెల రోజులుగా వీరి కదలికలపై నిఘా పెట్టినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజే కూడా ఉన్నారు. ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు జరగడం, ఛత్తీస్‌గఢ్‌లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో, అక్కడి నుంచి తప్పించుకున్న మావోయిస్టులు ఏపీలోని అంతర్గత ప్రాంతాల్లోకి ప్రవేశించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరికి ఎవరు సహకరించారు, ఏవైనా దాడులకు ప్రణాళికలు రచించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో కూడా ఏపీలోని ఒక నగరంలో ఇంత పెద్ద సంఖ్యలో నక్సల్స్‌ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనతో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :