Monday, 17 March 2025 04:07:09 PM
# Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు # DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ # Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి # L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్ # KA Paul: రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం అనిపించుకోవడం ఒక అన్నగా బాధ కలిగించింది: కేఏ పాల్ # Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి # Narendra Modi: మేం శాంతిని కోరుకుంటుంటే... పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ # AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం # AR Rahman: నేనింకా రెహమాన్ భార్యనే... ఆడియో సందేశం వెలువరించిన సైరా బాను # Namrata Shirodkar: విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత # Kalyan Ram: ఆమెను 'అమ్మ' అనే పిలుస్తాను: నందమూరి కల్యాణ్ రామ్ # North Macedonia: నైట్‌క్లబ్‌లో ప్రమాదం.. 59 మంది సజీవ దహనం # Umran Malik: ఐపీఎల్‌కు ముందు కోల్‌కతాకు భారీ ఎదురుదెబ్బ.. పేస్ సెన్సేషన్ అవుట్! # Actor Nithiin: పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నిస్తే నితిన్ రిప్లయ్ ఇదే! # Heat Waves: ఏపీలోని ఈ మండలాల్లో నేడు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు!

సంక్రాంతికి బస్సులన్నీ ఫుల్.. ఇప్పటి నుంచే ఆన్ లైన్ రిజర్వేషన్

హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు నగరాలకు ప్రత్యేక సర్వీసులు పండగ రద్దీని తట్టుకునేందుకు 3 వేల స్పెషల్ బస్సులు ! ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామంటున

Date : 24 December 2024 01:38 PM Views : 151

Studio18 News - ANDHRA PRADESH / : సంక్రాంతి పండుగకు ఆంధ్రాలోని తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిటీ వాసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్ టికెట్లను ఆన్ లైన్ లో రిజర్వ్ చేసుకుంటున్నారు. పండుగ సమీపిస్తే సీట్లు దొరికే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ముందే జాగ్రత్తపడుతున్నారు. దీంతో రిజర్వేషన్ కు రద్దీ పెరిగిందని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుకు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరించారు. ఏపీలోని పలు నగరాలకు రైళ్లు అందుబాటులో ఉండడంతో దాదాపు సగం జనం రైళ్లలో వెళతారని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ గతేడాది సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని వివిధ నగరాలకు కూడా సంక్రాంతి రద్దీ ఎక్కువే ఉండనుంది. కరీంనగర్ వంటి నగరాలకు రైల్వే కనెక్టివిటీ లేకపోవడంతో సామాన్యులు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించనున్నారు. దీంతో రైల్వే కనెక్టివిటీ లేని రూట్లలో బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి సమాచారం తెప్పించుకుని, దానికి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు.

Also Read : టీ20 వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :