Studio18 News - ANDHRA PRADESH / : అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తులూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆయనపై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది.
Admin
Studio18 News