Saturday, 24 January 2026 01:52:15 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

పవన్ కు తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ విన్నపం!

దేవరకొండ రాజు నేతృత్వంలో పవన్ ను కలిసిన బృందం తమిళనాడులో తెలుగువారి పరిస్థితులను వివరించిన వైనం చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి చర్యలు తీసుక

Date : 16 November 2024 01:59 PM Views : 417

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో వీరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులోని తెలుగువారి పరిస్థితుల గురించి పవన్ కు వీరు వివరించారు. చెన్నై, కాంచీపురం, కోయంబత్తూరు, మధురై, తిరుత్తణి, కృష్ణగిరి, తిరువళ్లూరు, చెంగల్పట్టు ప్రాంతాల్లో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నారని డిప్యూటీ సీఎంకు వీరు వివరించారు. వివిధ రంగాల్లో తెలుగువారు స్థిరపడ్డారని తెలిపారు. జయలలిత సీఎంగా ఉన్న రోజుల్లో చెన్నైలో తెలుగు భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారని... అయితే, ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పారు. చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పవన్ ను తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ తరపున తమిళనాడులో చేస్తున్న సామాజిక సేవలు, తెలుగు భాష, సంస్కృతి కోసం చేస్తున్న కృషిని పవన్ కు వివరించారు. వారు చేస్తున్న సేవలను పవన్ అభినందించారు. పవన్ ను కలిసిన వారిలో దేవరకొండ రాజుతో పాటు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, ఏఎం మనోజ్, ప్రియా శ్రీధర్, బి.రఘునాథ్ తదితరులు ఉన్నారు.

Also Read : ట్రంప్ గెలవడంతో ఎక్స్ కు గుడ్ బై చెబుతున్న లక్షలాదిమంది యూజర్లు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :