Monday, 17 March 2025 11:15:16 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

Maredumilli: విహార యాత్రలో విషాదం.. మారేడుమిల్లిలోని జలపాతంలో ఇద్దరు మెడికోల మృతి

Date : 23 September 2024 01:27 PM Views : 42

Studio18 News - ANDHRA PRADESH / : జలపాతంలో దిగి సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులు కళ్లముందే కొట్టుకుపోయారు.. ఉన్నట్టుండి నీటి ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు. తోటి విద్యార్థులు అతికష్టమ్మీద ఇద్దరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాజమండ్రిలోని పర్యాటక ప్రదేశం మారేడుమిల్లిలో ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలను అధికారులు సోమవారం ఉదయం గుర్తించారు. గల్లంతైన మరో విద్యార్థి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. సరదాగా మొదలైన ఆ విద్యార్థుల విహారయాత్ర చివరకు విషాదంగా ముగిసింది. విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఆదివారం మారేడుమిల్లికి విహారయాత్రకు వచ్చారు. అందరూ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇందులో పదిమంది అమ్మాయిలు కాగా నలుగురు అబ్బాయిలు ఉన్నారు. మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతంలో విద్యార్థులు సరదాగా ఈత కొట్టారు. ఈ క్రమంలోనే భారీ వర్షం కురవడంతో జలపాతంలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నీళ్లలో ఉన్న సీహెచ్ హరదీప్, కే సౌమ్య, బీ అమృత‌, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇది గమనించి మరికొందరు విద్యార్థులు నీళ్లలోకి దిగి హరిణిప్రియ, గాయత్రిపుష్పలను అతికష్టమ్మీద ఒడ్డుకు చేర్చారు. వారిని హుటాహుటిన రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయిన విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి విద్యార్థుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్వతీపురం జిల్లా బొబ్బిలికి చెందిన సౌమ్య, బాపట్లకు చెందిన అమృత మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మరో యువకుడు హరదీప్ ఆచూకీ ఇంకా దొరకలేదని వివరించారు. కాగా, హరిణిప్రియ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో రంపచోడవరం ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :