Thursday, 15 May 2025 03:19:47 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

YS Sharmila: టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు: పెట్రో ధరలపై భగ్గుమన్న షర్మిల

పొరుగు రాష్ట్రాల్లో కంటే ఏపీలో పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయన్న షర్మిల గతంలో 17 రూపాయలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారని వెల్లడి ఇప్పుడు అధికారంలో

Date : 25 March 2025 03:42 PM Views : 136

Studio18 News - ANDHRA PRADESH / : తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు అని విమర్శించారు. ప్రతిపక్షంలో ఒక మాట... అధికారపక్షంలో మరో మాట... గత 10 ఏళ్లుగా ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందువరసలో పెట్టి... రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని షర్మిల మండిపడ్డారు. "ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 109.60, డీజిల్ ధర రూ. 97.47గా ఉంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో పెట్రోల్ రూ. 100.86, డీజిల్ రూ. 92.39; కర్ణాటకలో పెట్రోల్ రూ. 102.90, డీజిల్ రూ. 88.99; తెలంగాణలో పెట్రోల్ రూ. 107.46, డీజిల్ రూ. 95.70గా ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం, ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది" అని షర్మిల వివరించారు. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు లీటరుకు రూ. 17 తగ్గించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. గతంలో జగన్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక వాటిని పెంచారని గుర్తు చేసింది. రెండు పార్టీలు కలిసి ప్రజల నుంచి రూ. 50 వేల కోట్లు వసూలు చేశాయని ఆరోపించారు. "కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలి. 17 రూపాయలు ధర తగ్గించి ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :