Thursday, 15 May 2025 03:10:56 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

విశాఖలో లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం

ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న బాధితురాలు సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేసిన బాధితురాలు వంశీతో పాటు అతని ముగ్గురు స్నేహితులు సామ

Date : 19 November 2024 04:03 PM Views : 149

Studio18 News - ANDHRA PRADESH / : ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడినా కామాంధుల తీరు మాత్రం మారడం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో మరో దారుణం చోటుచేసుకుంది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే... పోలీసులు చెపుతున్న వివరాల ప్రకారం బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన సహచర విద్యార్థి అయిన వంశీతో ఆమె స్నేహం చేసింది. తాను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన వంశీ... గత ఆగస్ట్ 10న కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే నెల 13న డాబా గార్డెన్స్ లోని తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేశ్, జగదీశ్ బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని, లేకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె వంశీ దృష్టికి తీసుకెళ్లింది. వంశీ కూడా వారి కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. రోజురోజుకూ ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో నిన్న ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఇది గమనించిన బాధితురాలి తండ్రి ఆమెను అడ్డుకుని... ఏం జరిగిందని నిలదీశారు. దీంతో, అసలు విషయం బయటపడింది. ఆయన వెంటనే విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురినీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

Also Read : అంతర్జాతీయ పురుషుల దినోత్సవం వేళ మహేశ్ బాబు స్పందన

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :