Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మద్దతు ధర విషయమై ఆరా తీసేందుకు గాను జిల్లాలోని గంగూరు, ఈడుపుగల్లులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈడుపుగల్లులో చంద్రబాబు నేరుగా రైతులతో మాట్లాడారు. అలాగే పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును సందర్శించారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సిబ్బంది, రైతులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వం వారి ఖాతాలలో నగదు జమ చేస్తోంది.
Also Read : 'బచ్చల మల్లి' - మూవీ రివ్యూ!
Admin
Studio18 News