Wednesday, 30 April 2025 07:41:38 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై సిట్ ఏర్పాటు.. ఎవరీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ..

Date : 27 September 2024 11:51 AM Views : 68

Studio18 News - ANDHRA PRADESH / : Ttd Laddu Row : తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో సిట్ ఏర్పాటుపై జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిలీజ్ చేశారు. 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది సర్కార్. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సత్యనారాయణ, గోపీనాథ్, వెంకట్రావు, సీతారామరాజు, ఉమామహేశ్వర్, హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించింది చంద్రబాబు సర్కార్. అలాగే సిట్ కు సహకరించాలని హోంశాఖ, దేవదాయశాఖ, టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్.. ఈ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 9 మంది సభ్యులతో (పోలీసు అధికారులు) సిట్ ను నియమించింది. ఈ విచారణ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండేలా.. దీనికి సంబంధించి ఏ శాఖ నుంచైనా ఎలాంటి సమాచారమైనా రాబట్టుకునే స్వేచ్చను సిట్ కు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో 9మంది సభ్యుల బృందం పని చేస్తుంది. ఒక ఐడీ, ఒక డీఐజీ, ఒక ఎస్పీ, ఒక అడినషల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలతో కూడి బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. గోపీనాథ్ శెట్టి డీఐజీ, హర్షవర్దన్ రావు ఎస్పీ, వెంకట్రావు అడిషనల్ ఎస్పీ, సీతారామరాజు డీఎస్పీ, సత్యనారాయణ, ఉమామహేశ్వర్ రావు, సూర్యనారాయణ సీఐలుగా ఉన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విచారణ పూర్తి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ క్షణం నుంచే సిట్ పని చేయడం స్టార్ట్ అవుతుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే బాధ్యత సిట్ పై ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :