Thursday, 12 March 2026 04:00:58 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

జగన్ పాలేరు కేశినేని నాని... ప్రజారాజ్యంలో చేరి చిరంజీవినే విమర్శించారు: కేశినేని చిన్ని

Date : 08 May 2025 05:11 PM Views : 288

Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై ఆయన తమ్ముడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. నానికి వెన్నుపోటు రాజకీయాలు అలవాటుగా మారాయని, ఆయన టీడీపీ ద్వారా గెలిచి వైసీపీకి అమ్ముడుపోయారని చిన్ని ధ్వజమెత్తారు. జగన్ వద్ద నాని పాలేరుగా చేరారని విమర్శించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి చిరంజీవినే విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో రూ. 3,200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వ్యక్తే సూత్రధారి అని కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో, రాజ్ కసిరెడ్డితో పాటు మరో ముగ్గురికి మాత్రమే ప్యాలెస్‌లోకి ప్రవేశం ఉందని తెలిపారు. ఈ ఆరోపణలపై తాను సీబీఐ విచారణకు సిద్ధమని, జగన్ కూడా సిద్ధమా? అని చిన్ని సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే నాని తనపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్ కసిరెడ్డితో తాను వ్యాపార లావాదేవీలు జరిపిన మాట వాస్తవమేనని అంగీకరించిన చిన్ని... కసిరెడ్డికి జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసిన తర్వాత ఆయనకు తాను దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్, ఇసుక మాఫియాపై నాని ఎందుకు ఒక్కసారైనా ప్రశ్నించలేదని నిలదీశారు. తాను నికార్సైన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధినని, బురద రాజకీయాల జోలికి వెళ్లనని కేశినేని చిన్ని పేర్కొన్నారు. జగన్ కార్యాలయాల్లోనే లిక్కర్ స్కామ్ లావాదేవీలు జరిగాయని, దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశానని, 24 గంటల్లో జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :