Wednesday, 25 June 2025 07:28:56 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

జగన్ పాలేరు కేశినేని నాని... ప్రజారాజ్యంలో చేరి చిరంజీవినే విమర్శించారు: కేశినేని చిన్ని

Date : 08 May 2025 05:11 PM Views : 65

Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై ఆయన తమ్ముడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. నానికి వెన్నుపోటు రాజకీయాలు అలవాటుగా మారాయని, ఆయన టీడీపీ ద్వారా గెలిచి వైసీపీకి అమ్ముడుపోయారని చిన్ని ధ్వజమెత్తారు. జగన్ వద్ద నాని పాలేరుగా చేరారని విమర్శించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి చిరంజీవినే విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో రూ. 3,200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వ్యక్తే సూత్రధారి అని కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో, రాజ్ కసిరెడ్డితో పాటు మరో ముగ్గురికి మాత్రమే ప్యాలెస్‌లోకి ప్రవేశం ఉందని తెలిపారు. ఈ ఆరోపణలపై తాను సీబీఐ విచారణకు సిద్ధమని, జగన్ కూడా సిద్ధమా? అని చిన్ని సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే నాని తనపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్ కసిరెడ్డితో తాను వ్యాపార లావాదేవీలు జరిపిన మాట వాస్తవమేనని అంగీకరించిన చిన్ని... కసిరెడ్డికి జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసిన తర్వాత ఆయనకు తాను దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్, ఇసుక మాఫియాపై నాని ఎందుకు ఒక్కసారైనా ప్రశ్నించలేదని నిలదీశారు. తాను నికార్సైన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధినని, బురద రాజకీయాల జోలికి వెళ్లనని కేశినేని చిన్ని పేర్కొన్నారు. జగన్ కార్యాలయాల్లోనే లిక్కర్ స్కామ్ లావాదేవీలు జరిగాయని, దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశానని, 24 గంటల్లో జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :