Studio18 News - ANDHRA PRADESH / Guntur : మేడే సందర్భంగా ఉద్యోగ కార్మికుల క్రీడా సాంస్కృతి ఉత్సవాల ద్వారా వారోత్సవాలు జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సిఐటియు గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు తూట్లు పొడుస్తున్నాయని అన్నారు. నేడు కార్మిక వర్గం వారానికి 90 గంటలు పని చేయాలని రకరకాల కార్పొరేట్ శక్తుల విధానాలు వినిపిస్తున్నాయని దీనికి భిన్నంగా ఐయల్ఓ సైతం 36 గంటలు మాత్రమే పనిచేయాలని తీర్మానం ఉందని అన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటల్లో మార్పులు తెచ్చి కార్మికుల శ్రమను దోచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఇది సరైన కాదన్నారు. 8 గంటల పనిలో ఎటువంటి మార్పులు లేకుండా ఉండేందుకు మే డే స్ఫూర్తితో మే 20న జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Admin
Studio18 News