Monday, 24 March 2025 07:01:54 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

Pawan Kalyan : అమెరికా పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ.. చంద్రబాబు, పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 25 September 2024 10:47 AM Views : 40

Studio18 News - ANDHRA PRADESH / : Pawan Kalyan – Modi : ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది. మగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లినప్పటికీ.. త్వరలో అమెరికాలో జరిగే ఎన్నికల అంశానికి మాత్రం మోదీ దూరంగా ఉన్నారు. పర్యటనలో మొదటి రోజైన శనివారం ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడాతో యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్ లో మోదీ భేటీ అయ్యారు. అక్కడ నలుగురు లీడర్లు క్వాడ్ సమ్మిట్ కు హాజరయ్యారు. తరువాత ఆస్ట్రేలియా, జపాన్ లీడర్లతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆదివారం మోదీ న్యూయార్క్ లో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. సోమవారం న్యూయార్క్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మోదీతో భేటీ అయ్యారు. పలు దేశాల అధినేతలు మోదీతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటన విజయవంతం ముగించుకొని మోదీ భారత్ చేరుకున్నారు. అయితే, మోదీ అమెరికా పర్యటనను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ‘ఎక్స్’లో పోస్టు ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ప్రతి భారతీయుడి ఆత్మను కదిలించింది. ప్రతి కరచాలనం, ప్రతి ప్రసంగం, 1.4 బిలియన్ ప్రజల ఆశలు, కలలను మోసుకెళ్లారు. క్వాడ్ సమ్మిట్ కు నాయకత్వం వహించడం నుంచి యూఎన్ ప్యూచర్ సమ్మిట్ వరకు మోదీ నాయకత్వం ప్రపంచ వేదికపై భారతదేశం బలాన్ని ప్రదర్శించింది. మోదీ ప్రభావవంతమైన సమావేశాలు, సెమీకండక్టర్ ప్లాంట్ ను భద్రపర్చడం, 297 అమూల్యమైన పురాతన వస్తువులను భారత్ తిరిగి పొందడం. అత్యాధునిక సాంకేతికతతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చడం భారతదేశ పునరుజ్జీవనంలో మైలురాళ్లు. భారతదేశం ఇప్పుడు మార్పుకోసం చోదక శక్తిగా ఉంది. ప్రధాని దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్ అద్భుత విజయాలను అందుకుంటుంది.. ఇది మన క్షణం.. అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని భారత్ కు తిరిగి వచ్చిన ప్రధాని మోదీకి ‘ఎక్స్’ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం చెప్పారు. ప్రధాని మోదీ వంటి రాజనీతిజ్ఞుడి నాయకత్వంలో పనిచేయడం అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భారత్ ను ప్రపంచ దేశాలన్నింటి కంటే అత్యున్నత స్థానంలో నిలిపారని కొనియాడారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే అగ్రనాయకుడిగా ఎదిగారు. అన్ని దేశాలనూ ఏకతాటిపైకి తసీుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం అని చంద్రబాబు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :