Wednesday, 25 June 2025 08:06:53 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Success Story: తండ్రి కలను తీర్చిన తనయ.. అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికv

Date : 08 March 2025 03:41 PM Views : 125

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కెంబూరి నైమిశా అతి చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన ఆమె, చిన్నతనం నుంచి న్యాయ వ్యవస్థపై ఆసక్తి కలిగి ఉంది. లా సెట్‌లో 300వ ర్యాంకు సాధించి ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివి, కష్టపడి చదివి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె విజయం మహిళలకు స్ఫూర్తినిస్తుంది.

అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై శభాష్ అని ప్రశంసలు పొందుతున్న మహిళ కెంబూరి నైమిశా. అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కెంబూరి నైమిశా చిన్నతనం నుంచి పట్టుదలతో ఉండేది. పెదనాన్న కెంబూరి రామ్మోహన్ రావు ఎంపీగా పని చేయగా, పెదనాన్న కెంబూరి లక్ష్మణ్ మోహన్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) గా రిటైర్ అయ్యారు. ఈమె మేనత్త కిమిడి మృణాళిని ఏపి రాష్ర్ట మంత్రిగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో కెంబూరి నైమిశా ఇంటికి నిత్యం వందలాదిమంది ప్రజలు వచ్చి తమ ఇబ్బందులను విన్నవించుకొని సహాయం చేయమని కోరుతుండేవారు. చిన్నతనంలోనే అలాంటి ఎన్నో సమస్యలను దగ్గరుండి చూసిన నైమిశా తాను కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకునేది. అంతేకాకుండా తన తండ్రి భరత్ మోహన్ బ్యాంకు మేనేజర్ గా పనిచేసేవాడు. అయితే తనకు బ్యాంక్ మేనేజర్ గా తన కెరియర్ ఆగిపోవడం ఇష్టం లేక ఎలాగైనా సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం దక్కించుకోవాలని తనకున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకొని సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు. అయితే ఆయన ఎంత కష్టపడ్డా సివిల్స్ లో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో అటు బ్యాంకు ఉద్యోగం లేక, కష్టపడి చదివినా సివిల్స్ లో ఉద్యోగం పొందలేక మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుండేవాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :