Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం విజయవాడలో పర్యటించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సాయంత్రం 4.30 గంటలకు ఆయన విజయవాడకు బయల్దేరుతారు. విజయవాడ గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని ఆయన సందర్శించనున్నారు. శారదా పీఠంలో శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలవనున్నారు. ఈ మేరకు వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించింది.
Also Read : మునగ ఆకులతో ఇంత ఆరోగ్యమా... అస్సలు మిస్ కావొద్దు!
Admin
Studio18 News