Wednesday, 30 April 2025 04:22:15 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ

మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశం హాజరైన నాదెండ్ల, అచ్చెన్నాయుడు, పయ్యావుల, సత్యకుమార్ అధికారులకు దిశానిర్దేశం

Date : 19 March 2025 02:04 PM Views : 47

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ సచివాలయంలో మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రులు వివరించారు. జాతీయ సగటు 3.61% కంటే ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్యోల్బణం రేటు 2.44% తక్కువగా ఉన్న విషయాన్ని వారు ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా తక్కువగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని వెల్లడించారు. వరుసగా 3 నెలలు జాతీయ సగటు కన్నా రాష్ట్ర ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు అవుతోందని స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 154 మండల కేంద్రాలు, 151 రైతు బజార్ల నుంచి ప్రతిరోజు సీపీ యాప్ ద్వారా ధరలను సేకరించి వాటిపై విశ్లేషణ చేస్తున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలకు ఉన్న ధర నివేదిక కేంద్రాలను 26 జిల్లాలకు పెంచేలా ఏప్రిల్ నుంచి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించి, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. వస్తు రవాణా చార్జీలలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు రవాణా శాఖ వారు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బియ్యం, కందిపప్పు, వంట నూనె, టమాటా, ఉల్లిపాయల ధరల స్థిరీకరణపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ధాన్యంపై మార్కెట్ రుసుము రెండు శాతం నుంచి ఒక శాతం తగ్గించేందుకు.... క్యాబినెట్ ఆమోదానికి నివేదిక తయారు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. తృణధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు, రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :