Thursday, 15 May 2025 03:06:13 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

భారత్- పాక్ యుద్ధం నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం

Date : 09 May 2025 06:37 PM Views : 23

Studio18 News - ANDHRA PRADESH / : భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న లేదా ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పౌరుల సౌకర్యార్థం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను తక్షణమే ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న జమ్మూకశ్మీర్, లడఖ్ తో పాటు, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్న లేదా ఆ రాష్ట్రాలకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవసరమైన సమాచారం, సహాయం కోసం ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని చంద్రబాబు సూచించారు. ఈ సహాయ కేంద్రం రోజులో 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ నిరంతరాయంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత సున్నితమైన పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వం మరియు సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలతో ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారని తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :