Thursday, 15 May 2025 03:26:28 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

సనాతన పరిరక్షణ, పార్టీ విస్తరణ.. అజెండాతోనే జనసేన ప్లీనరీ...!

జనసేన నిర్వహించే 12వ వ్యవస్థాపక దినోత్సవం రెండు అంశాల అజెండాతోనే ఉంటుంది. ఎన్నికలు చాలా దూరం ఉన్నందున వాటి ప్రస్తావన ఉండదు.

Date : 14 March 2025 02:27 PM Views : 76

Studio18 News - ANDHRA PRADESH / Kakinada : అధికారం లోకి వచ్చిన తర్వాత తొలిసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. జయ కేతనం పేరుతో జరగుతున్న ఈ ప్లీనరీలో పవన్ కళ్యాణ్ రెండు కీలక అంశాలు ఎజెండాగా ప్రసంగించబోతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణ.. ఈ రెండు అంశాలే ప్లీనరీకి ప్రధాన ఏజెండాగా మారాయి. పవన్ ప్రసంగం వీటిపైనే ఉండబోతుందని జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం. 50 ఎకరాల ప్రాంగణం.. 1500మంది పోలీసులు.. లక్షల మంది జనసైనికులు..! పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ గ్రామంలో 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 'జయ కేతన' సభ జరగబోతుంది. ఇది జనసేనకు 12వ ఆవిర్భావ సభ. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు ఉదయ్, బాలశౌరి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. వేదికపై పవన్​ కల్యాణ్​తోపాటు 250 మంది వరకు ఆసీనులయ్యేలా వేదిక సిద్ధం చేశారు. ఈ సభకు 'రావు సూర్యారావు బహుదూర్ మహారాజ్', 'డొక్కా సీతమ్మ,' "మల్లాడి సత్యలింగ నాయకర్ ' లాంటి సామాజిక వేత్తల పేర్లు మూడు ద్వారాలకు పెట్టారు. తెలుగు సంస్కృతి చరిత్ర అద్దం పట్టేలా సభ నిర్వహిస్తామని ఇప్పటికే జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జనసేన భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు. లక్షల సంఖ్యలో తరలివచ్చే ఈ జనసేన ఆవిర్భావ సభకు 1500కుపైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే జనసైనికుల బాధ్యతలను ఆయా జిల్లాల ఇన్చార్జ్‌లకు అప్పచెప్పారు. ప్రధాన ఎజెండాలు ఇవే 11 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకి జనసేన భవిష్యత్తు ప్రణాళికలుగా సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణను ఈ వేదికపై నుంచి పవన్ కళ్యాణ్ ప్రకటించబోతున్నారు. ఏపీ అనే కాకుండా తెలంగాణ తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లోనూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ పలు యాత్రలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వీటిని మరింత తీవ్రతరం చేయబోతున్నారు. దేశ వ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మపరిరక్షణ కోసం జనసేన ఎలా కట్టుబడి ఉందో ప్రకటించబోతున్నారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేలా పవన్ ప్రసంగం సాగబోతోంది. దానితోపాటు జనసేన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించేలా ఎలా బలోపేతం చేయాలనే దానిపైనా కేడర్‌కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇతర పార్టీ నాయకులు జనసేన వైపు రావాలనుకుంటే వారికి ఆహ్వానం పలుకుతూనే దానికి వారు ఎలాంటి నియమాలు పాటించాలనే దానిపైనా ఒక స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ప్రస్తుతానికి ఈ రెండు ఎజెండాలతోటే ' జయకేతన' సభ నడవబోతోంది. పిఠాపురం నియోజకవర్గ మొత్తం పవన్ గారి తాలూకా మారిపోయిన నేపథ్యంలో అక్కడ తొలిసారి జరుగుతున్న ప్లీనరీ సూపర్ సక్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు జనసేన నిర్వాహకులు. అయితే సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మొదలయ్యేసరికి మాత్రం సాయంత్రం అయిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :