Monday, 17 March 2025 05:04:56 PM
# Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

Nara Lokesh: టీచర్లకు ఇక యాప్ ల భారం ఉండదు: మంత్రి నారా లోకేశ్

ఉపాధ్యాయులపై కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వెల్లడి 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారన్న లోకేశ్ జీవో 117 రద్దుకు ప్

Date : 13 March 2025 01:28 PM Views : 25

Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలపై శాసనమండలిలో నేడు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. ఇకపై ఏపీలో టీచర్లకు యాప్ ల భారం ఉండదని స్పష్టం చేశారు. ఉధ్యాయులపై గతంలో పెట్టిన కేసులను ఎత్తివేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని, దాని ఫలితంగానే విద్యార్థులు నైపుణ్యాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించి, రాబోయే నాలుగేళ్లలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, దీనికి ప్రధాన కారణం జీవో 117 అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ జీవో కారణంగానే అనేక పాఠశాలలు మూతపడ్డాయని, సింగిల్ టీచర్ పాఠశాలల సంఖ్య పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గత ప్రభుత్వం రికార్డులను తారుమారు చేసిందని, డ్రాప్ బాక్స్ వ్యవస్థ ద్వారా లక్షల మంది విద్యార్థుల వివరాలను తప్పుగా చూపించారని ఆరోపించారు. దీనివల్ల డ్రాపౌట్ రేటు 12.5%కి పెరిగిందని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులకు నిధులు విడుదల చేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ, నోట్ బుక్స్, చిక్కీలు, గుడ్లు వంటి వాటిపై గత ప్రభుత్వం నాయకుల ఫోటోలు వేసుకుందని విమర్శించారు. ప్రస్తుతం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కూల్ కిట్లు అందిస్తున్నామని, వాటిపై ఎలాంటి రాజకీయ రంగులు, నాయకుల ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు. పాఠశాలల్లో పిల్లల పుస్తకాల బరువు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని, సెమిస్టర్ విధానంలో మొదటి సెమిస్టర్ కు రెండు పుస్తకాలు, రెండో సెమిస్టర్ కు రెండు పుస్తకాలు చొప్పున అందిస్తామని తెలిపారు. సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. టోఫెల్ విధానం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, ఐబీ స్కూల్స్ కోసం గత ప్రభుత్వం రూ.5 కోట్లు వృథా చేసిందని ఆరోపించారు. ఉన్నత విద్యారంగంలోనూ సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,282 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు ఒక యూనిఫైడ్ చట్టం తీసుకువస్తామని, తద్వారా వాటి కార్యకలాపాల్లో మరింత పారదర్శకత ఉంటుందని చెప్పారు. నూతన విద్యా విధానంలో భాగంగా డీప్ టెక్ యూనివర్సిటీ, ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చివరగా, విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ సహకరించాలని మంత్రి లోకేశ్ కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :