Friday, 14 February 2025 07:53:14 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి..

#honeytrap #andhrapradesh #srikakulam #women

Date : 26 January 2025 01:11 AM Views : 48

Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి, నగదు దోచేసిన ఘటనలో ఐదుగురిని విశాఖ జిల్లా భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయి పేరుతో వలవేయడం, బెదిరింపులకు పాల్పడడం, దాడి చేయడం వంటివి హనీ ట్రాప్ కేసుల్లో అసలు లక్ష్యం. కొన్ని రోజుల క్రితమే వైజాగ్ లో హనీ ట్రాప్ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది మరవకముందే శనివారం మరో కేసులో శ్రీకాకుళంకి చెందిన బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన ఇప్పుడు విశాఖ నగరంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ కేసులు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఓ మహిళ బాధితులకు ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి తమ వైపుకు తిప్పుకుంటారు. ఆ తర్వాత తమను ఓ చోటుకి రమ్మని, వారిపై దాడి చేసి, ఉన్నదంతా కాజేస్తారు. అదే తరహాలో ఓ కేసు తాజాగా బయటపడింది. విశాఖ నగరం కంచరపాలేనికి చెందిన ఓ వివాహిత, సురేశ్, చక్రధర్, వెంకటేశ్, విజయనగరానికి చెందిన లక్ష్మణ్ తో పాటు మరో ఇద్దరు కలిసి సులువుగా డబ్బు సంపాదించే దిశగా ఓ ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ చేయడం ఆరంభించారు. అలా పక్కా ప్లాన్ చేసి శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు. అలా జనవరి 18న ఆ యువతి రామారావుకి ఫోన్ చేసి, ఆకట్టుకునే మాటలతో తనవైపుకు తిప్పుకుంది. తాను జనవరి 19న విశాఖకు వస్తానని, ఆ రోజు ఇద్దరం కలుసుకుందామని చెప్పడంతో.. అప్పటికే ఆమె మాయ మాటలు నమ్మిన మత్తులో ఉన్న రామారావు కూడా అందుకు ఓకే చెప్పేశాడు. చెప్పినట్టుగానే ఆ యువతి ఆ రోజున రామారావుకు ఫోన్ చేసింది. అప్పుడే తన కుమార్తెను బోయిపాలెం వద్ద హాస్టల్‌లో దింపేసి వెళ్లిపోతున్న రామారావు.. యువతి చెప్పినట్లుగా తగరపువలస సమీపంలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లాడు. అంతలోనే అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనివద్ద ఉన్న దాదాపు రూ.50వేలు, ఏటీఎం కార్డులు లాక్కున్నారు. ఆ తర్వాతి రోజు వారు అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.7 వేలు కాజేశారు. దీంతో తాను మోసపోయానని బాధితుడైన రామారావు భీమిలి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని మొత్తం పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అలా ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు ఐదుగురిని అరెస్టు చేసి, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంతకీ ఆ యువతి ఎవరు, ఇప్పటివరకు ఎంత మందిని మోసం చేసింది అన్న పలు విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు