Studio18 News - ANDHRA PRADESH / : విశాఖపట్నంలో కొందరు అక్రమార్కులు అతి తెలివి ప్రదర్శించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విశాఖలో గ్రీన్బెల్ట్ ఆక్రమణలపై సిటీ కమిషనర్కు ఆయన ఫిర్యాదు చేశారు. మురళీనగర్ హైవే దగ్గర మెగా మాల్ నిర్మించారు. అయితే, ఆ మాల్ యాజమాన్యం చెట్లను తొలగించి, గ్రీన్బెల్ట్పై నిర్మాణాలు చేపట్టినట్టు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అంతేగాక ఆ నిర్మాణాలకు చంద్రబాబు, పవన్తో పాటు తన ఫ్లెక్సీలను కూడా పెట్టారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. సిటీ కమిషనర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన జీవీఎంసీ ఆక్రమణలను తొలగిస్తోంది.
Also Read : మరో సెన్సేషనల్ రికార్డు సాధించిన పుష్ప-2
Admin
Studio18 News