Studio18 News - జాతీయం / : వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ అకాల మరణం స్కీయింగ్ ప్రమాదం తర్వాత గుండెపోటుతో ఆసుపత్రిలో కన్నుమూత సంపాదనలో 75 శాతం దానం చేస్తానని మరోసారి ప్రకటించిన అనిల్ అగర్వాల్ కుమారుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానంటూ భావోద్వేగ పోస్ట్ అనిల్ అగర్వాల్ కుటుంబానికి ప్రధాని మోదీ సంతాపం ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49) అమెరికాలో అకాల మరణం చెందారు. ఈ పుత్రశోకంలోనే, తన సంపాదనలో 75 శాతం సమాజ సేవకు కేటాయిస్తానని గతంలో చేసిన వాగ్దానాన్ని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. కుమారుడి మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన అనిల్ అగర్వాల్, 'ఎక్స్' వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. "నా కొడుకు అగ్ని మమ్మల్ని ఇంత త్వరగా విడిచి వెళ్ళిపోయాడు. నా స్నేహితుడిలా ఉండేవాడు. మా సంపాదనలో 75 శాతం సమాజానికి ఇస్తానని వాగ్దానం చేశాను. ఆ మాటను ఈరోజు మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. నువ్వు లేకుండా ఈ మార్గంలో ఎలా నడవాలో తెలియడం లేదు, కానీ నీ ఆలోచనలను ముందుకు తీసుకెళతాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బిడ్డా ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి మహిళ స్వశక్తితో నిలబడాలని, యువతకు ఉపాధి లభించాలని తామిద్దరం కలలు కన్నామని, ఆ కలను నెరవేరుస్తానని ఆయన తెలిపారు. మరణించిన అగ్నివేశ్, వేదాంత అనుబంధ సంస్థ తల్వండి సోబో పవర్ లిమిటెడ్కు ఛైర్మన్గా వ్యవహరించారు. సుమారు రూ. 27,000 కోట్ల సంపద కలిగిన అనిల్ అగర్వాల్కు అగ్నివేశ్తో పాటు కుమార్తె ప్రియా అగర్వాల్ కూడా ఉన్నారు. అగ్నివేశ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు అగర్వాల్ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కుమారుడిని కోల్పోయిన తీవ్ర దుఃఖంలోనూ తన దాతృత్వ సంకల్పాన్ని అనిల్ అగర్వాల్ మరోసారి చాటడం గమనార్హం.
Admin
Studio18 News