Monday, 23 June 2025 02:39:02 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

అరేబియా సముద్రంలో పాక్ నౌకను వెంటాడిన భారత నేవీ షిప్..!

ఏడుగురు భారత జాలర్లను తీసుకెళుతున్న పాక్ షిప్ కాపాడాలంటూ కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించిన మత్స్యకారులు రెండు గంటల పాటు ఛేజ్ చేసి ఏడుగురిని కాపాడిన నే

Date : 19 November 2024 12:51 PM Views : 149

Studio18 News - జాతీయం / : భారత మత్స్యకారులను బంధించి తీసుకెళుతున్న పాకిస్థాన్ షిప్ ను భారత కోస్ట్ గార్డ్ షిప్ వెంటాడింది. అరేబియా సముద్రంలో దాదాపు రెండు గంటల పాటు ఛేజ్ చేసి పాక్ అధికారుల చెర నుంచి మత్స్యకారులను విడిపించింది. మత్స్యకారులను సురక్షితంగా తీరం చేర్చింది. భారత కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. అరేబియా సముద్రంలో నో ఫిషింగ్ జోన్ సమీపంలో భారత మత్స్యకారుల బోటును పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక అడ్డగించింది. బోటుపై దాడి చేసి సముద్రంలో ముంచేసింది. ఏడుగురు మత్స్యకారులను బంధించి తమ దేశం తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. పాక్ నౌక దాడి చేయడం ప్రారంభించగానే మత్స్యకారులు భారత కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించారు. తమను కాపాడాలని వేడుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు కోస్ట్ గార్డ్ నౌకను మత్స్యకారుల రెస్క్యూ కోసం పంపించారు. భారత్- పాక్ మారటైమ్ సరిహద్దుకు చేరుకున్న కోస్ట్ గార్డ్ నౌక.. పాకిస్థాన్ నౌకను వెంటాడి అడ్డగించింది. పాక్‌ అధికారుల చెరనుంచి ఏడుగురు భారత మత్స్యకారులను విడిపించి తీరానికి చేర్చింది.

Also Read : ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :