Saturday, 07 March 2026 08:22:03 PM
# పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు

తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ

Date : 06 June 2025 04:28 PM Views : 307

Studio18 News - జాతీయం / : చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ దుర్ఘటనకు బాధ్యులని భావిస్తున్న పలువురు కీలక అధికారులపై చర్యలు తీసుకుంటున్న సిద్దరామయ్య ప్రభుత్వం, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి కె. గోవిందరాజ్‌ను పదవి నుంచి తొలగించగా, ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్‌ను బదిలీ చేసింది. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, ఇదివరకే గురువారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌తో పాటు మరికొందరు కీలక పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ చర్యలు తీసుకున్న మరుసటి రోజే, శుక్రవారం మరో ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు వేయడం గమనార్హం. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె. గోవిందరాజ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, హేమంత్ నింబాల్కర్‌ను ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి, బదిలీ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :