Wednesday, 16 July 2025 11:11:23 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

త్వరలో నాకూ ప్రమోషన్ వస్తుందనుకుంటున్నా: ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా

Date : 06 June 2025 04:47 PM Views : 52

Studio18 News - జాతీయం / : జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తనకు కూడా ప్రధాని మోదీ పదోన్నతి కల్పిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సమక్షంలో, చినాబ్ వంతెన ప్రారంభోత్సవ సభలో ఒమర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీని ఉద్దేశించి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, "2014లో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ ఇప్పుడు, ఒక కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా నేను డిమోట్ అయ్యాను. అప్పట్లో రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న వ్యక్తికి (ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను ఉద్దేశిస్తూ) లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదోన్నతి లభించింది. త్వరలోనే నాకూ పదోన్నతి లభిస్తుందని ఆశిస్తున్నాను. దీన్ని సరిదిద్దడానికి ఎక్కువ సమయం పట్టదని నేను భావిస్తున్నాను" అని అన్నారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి 2014 వరకు, జమ్ముకశ్మీర్‌ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)-కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో, కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌కు ఒమర్ అబ్దుల్లా తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :