Monday, 23 June 2025 02:35:28 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Nitin Gadkari: నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశం రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చ కోమటిరెడ్డి వెంట ఎంపీలు వంశీకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డి

Date : 11 March 2025 05:20 PM Views : 70

Studio18 News - జాతీయం / : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ భేటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డి ఉన్నారు.

గురుకులాల నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఎంపీల హర్షం తెలంగాణలోని 55 సమీకృత గురుకులాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధుల కేటాయింపుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, రామసహాయం రఘురామరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఒక్కో పాఠశాలకు రూ. 200 కోట్లు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి అని వారు పేర్కొన్నారు. పేద పిల్లలకు నాలుగో తరగతి నుండి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూపకల్పన చేసిందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నిధుల అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలిచినా వెళతామని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :