Wednesday, 25 June 2025 06:44:08 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Jaishankar: నాడు హైజాక్ అయిన ఆ విమానంలో ఆయన కూడా ఉన్నారు!: కేంద్ర మంత్రి జైశంకర్

Date : 14 September 2024 03:52 PM Views : 163

Studio18 News - జాతీయం / : ప్రస్తుతం స్విట్టర్లాండ్ పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ .. జెనీవాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి .. 'ది కాంధార్ హైజాక్' సిరీస్ గురించి మాట్లాడుతూ గతంలో తన జీవితంలో జరిగిన షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఈ సిరీస్ తాను చూడలేదు కాబట్టి దానిపై తాను మాట్లాడలేనని పేర్కొన్న జై శంకర్ .. 1984లో కూడా ఒక హైజాక్ జరిగిందని, అప్పుడు తాను ఉద్యోగంలో చేరి కొంత కాలమే అవుతోందన్నారు. ఆ హైజాక్ ఘటనను డీల్ చేసే బృందంలో తాను కూడా ఉన్నానని చెప్పారు. దీంతో తాను ఇంటికి రావడం కుదరదని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పానని, అయితే ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే .. హైజాక్ గురైన విమానంలో మా నాన్న కూడా ఉన్నారని తెలిసిందని, అదృష్టవశాత్తు విమానంలో ఉన్న వారికి ఏమీ కాలేదని తెలిపారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక వైవు హైజాక్‌కు సంబంధించి వ్యవహారాన్ని చూస్తోన్న బృందంలో పని చేస్తూ.. హైజాక్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కుటుంబ సభ్యుల్లోనూ తాను ఉన్నానని చెప్పారు. ఇంతకాలం ఎవరికీ పెద్దగా తెలియని ఈ విషయాన్ని చెప్పి మంత్రి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పుడు అసలు ఏమి జరిగింది అంటే.. 1984 ఆగస్టు 24న భారత్ కు చెందిన విమానం ఐసీ 421 ధిల్లీ నుండి టేకాఫ్ అయి చండీగఢ్ లో ల్యాండ్ కాగానే ఏడుగురు హైజాకర్లు కాక్ పిట్ లోకి ప్రవేశించారు. జైర్నెల్ సింగ్ బింద్రన్ వాలేతో పాటు ఇతరులను విడుదల చేయాలని విమానాన్ని హైజాక్ చేసిన ఆల్ ఇండియా సిఖ్ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. 36 గంటల పాటు ఆ విమానాన్ని హైజాకర్లు నాలుగు విమానాశ్రయాల మధ్య తిప్పారు. అలా ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చివరకు అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :