Thursday, 15 May 2025 01:33:22 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

గుజరాత్‌లో బాణసంచా, డ్రోన్లపై వారం రోజుల నిషేధం

Date : 09 May 2025 07:34 PM Views : 36

Studio18 News - జాతీయం / : భారత్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక భద్రతా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చేలా వారం రోజుల పాటు డ్రోన్లు, బాణసంచా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి ప్రకటించారు. ప్రజల భద్రత, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం హర్ష్ సంఘవి ఈ వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. "రాష్ట్రంలో జరిగే ఏ వేడుకల్లోనైనా బాణసంచా, డ్రోన్లపై ఈ నెల 15వ తేదీ వరకు నిషేధం విధిస్తున్నాం. దయచేసి ఈ మార్గదర్శకాలను పాటించి, ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఇందులో భాగంగానే గుజరాత్ ప్రభుత్వం తాజా ఆంక్షలను విధించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :