Wednesday, 16 July 2025 11:53:27 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Thieves: చోరీకొచ్చిన దొంగలు.. పకోడీలు వండుకుని తీరిగ్గా తిని, ఆపై లక్షలు దోచుకున్న వైనం!

Date : 24 July 2024 02:35 PM Views : 184

Studio18 News - జాతీయం / : ఓ ఇంట్లో చోరీకొచ్చిన దొంగల ముఠా తీరిగ్గా పకోడీలు వండుకుని తిని ఆపై లక్షల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిందీ ఘటన. తొలుత సెక్టార్ 82కు చెందిన శ్రీరామ్ త్రిపాఠి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు నేరుగా చోరీకి పాల్పడకుండా తొలుత వంటగదిలోకి వెళ్లి పకోడీలు వండుకుని తిన్నారు. ఆ తర్వాత ఇంట్లోని రూ. 40 లక్షల విలువైన నగదు, బంగారం, ఇతర సామాన్లను మూటగట్టుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పలు ఇళ్లలో ఈ ముఠా చోరీలకు పాల్పడింది. రిచా బాజ్‌పాయ్ నివాసంలోకి చొరబడిన దొంగలు రూ. 3 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆమె ఇంట్లో బీడీలు కాల్చి, పాన్ నమిలి బాత్రూంలో ఉమ్మేసినట్టు గుర్తించారు. మరికొన్ని ఇళ్లలో భోజనం చేశారు. ఒకే రోజులో పదుల సంఖ్యలో దొంగతనాలు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూకట్టారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల ముఠా కోసం గాలింపు మొదలుపెట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :