Monday, 30 March 2026 02:55:06 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Lok Sabha: లోక్‌స‌భ‌లో చైర్‌పై పేప‌ర్లు విసిరేసిన 8 మంది ఎంపీల స‌స్పెన్ష‌న్‌

Lok Sabha : లోక్‌స‌భ‌లో ఇవాళ 8 మంది ఎంపీల‌ను స‌స్పెండ్ చేశారు. పేప‌ర్లు చింపి చైర్‌పై విసిరేసిన ఘ‌ట‌న‌లో ఈ చ‌ర్య తీసుకున్నారు. చైర్‌లో దిలీప్ సైకియా ఉ

Date : 03 February 2026 08:30 PM Views : 99

Studio18 News - జాతీయం / : న్యూఢిల్లీ: లోక్‌స‌భ‌(Lok Sabha)లో ఇవాళ 8 మంది ఎంపీల‌ను స‌స్పెండ్ చేశారు. పేప‌ర్లు చింపి చైర్‌పై విసిరేసిన ఘ‌ట‌న‌లో ఈ చ‌ర్య తీసుకున్నారు. చైర్‌లో దిలీప్ సైకియా ఉన్న స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఎంపీలు త‌మ‌కు మైక్ ఇవ్వ‌డం లేద‌ని ఆరోపిస్తూ పేప‌ర్ల‌ను చింపి విసిరేశారు. స‌స్పెండ్ అయిన వారిలో మానికం ఠాగూర్‌, గురీత్ ఓజ్లా, రాజా వారింగ్‌, ఎబి ఈడెన్, కిర‌ణ్ రెడ్డి, వెంక‌ట్ రామ‌న్ ఉన్నారు. చైర్‌పై పేప‌ర్లు విసిరేయ‌డాన్ని స్పీక‌ర్ ఖండించారు. పార్ల‌మెంట‌రీ హుందాత‌నాన్ని ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని అన్నారు. బ‌డ్జెట్ సెష‌న్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఉపేక్షించ‌లేమ‌న్నారు. 8 మంది ఎంపీల‌ను స‌స్పెండ్ చేసిన త‌ర్వాత లోక్‌స‌భ‌ను బుధ‌వారానికి వాయిదా వేశారు. పార్ల‌మెంట్‌లో స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తే హ‌క్కు ప్ర‌తిప‌క్షాల‌కు ఉంద‌ని, స‌భ అంద‌రిద‌ని, చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని, కానీ స‌భా వ్య‌వ‌హారాల‌ను అడ్డుకోవ‌డం స‌రికాదు అని, నిర‌స‌న పేరుతో స‌భా నిర్వ‌హ‌ణ‌ను స్తంభింప‌చేయ‌డం కుద‌ర‌ద‌ని దిలీప్ సైకియా అన్నారు. ఎంపీల‌ను స‌స్పెండ్ చేయ‌డాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ త‌ప్పుప‌ట్టారు. ప్ర‌తి స‌భ్యుడిని మాట్లాడే హ‌క్కు ఉంద‌ని, వారి ఆందోళ‌న‌ల‌ను వినిపించుకోవాల‌ని ఆమె అన్నారు. ఎంపీల‌ను స‌స్పెండ్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :