Sunday, 08 March 2026 10:15:02 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ashoka emperor: జర్మనీలో సాంచి స్తూపం ప్రతిరూపం.. ఫొటో పోస్ట్ చేసిన విదేశాంగ మంత్రి

Date : 13 September 2024 12:21 PM Views : 397

Studio18 News - జాతీయం / : జర్మనీ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. బెర్లిన్ లోని ప్రసిద్ధ హంబోల్డ్ ఫోరమ్ ను సందర్శించారు. ఇది మానవ చరిత్ర, కళ, సంస్కృతికి సంబంధించి వేల సంవత్సరాల చరిత్ర కల్గిన మ్యూజియం. ప్రపంచ సంస్కృతి, కళలను అర్దం చేసుకున్న కళాభిమానులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఈ హంబోల్డ్ ఫోరమ్ వెలుపల ఉన్న ద్వారం వద్ద జైశంకర్ ఫోటో దిగి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ఈ ద్వారం ప్రత్యేకత ఏమిటంటే .. భారతదేశంలోని సాంచి స్తూపం యొక్క తూర్పు ద్వారానికి చెందిన ప్రతి రూపం ఇది. జైశంకర్ తన బెర్లిన్ పర్యటన సందర్భంగా సాంచి స్తూపం ద్వారం యొక్క ఈ ప్రతిరూపాన్ని సందర్శించారు. దీన్ని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. భారతదేశంలో సాంచి స్తూపం మధ్యప్రదేశ్ లోని రైసెన్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం .. భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలోని బౌద్ధమతం యొక్క గొప్ప చరిత్ర, నాగరికతకు చిహ్నం. ఇది మూడవ శతాబ్దం క్రితం భారతీయ చక్రవర్తి అశోకుడి కాలంలో నిర్మితమైంది. అయితే.. తర్వాత పాలకులు దీనిని ధ్వంసం చేయగా.. మళ్లీ పునరుద్ధరించారు. దాదాపు 2700 ఏళ్ల తర్వాత కూడా అశోకుడి సందేశాలను ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. బెర్లిన్ లోని హంబోల్డ్ ఫోరమ్ లో సాంచి స్తూపం యొక్క తూర్పు ద్వారంతో విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :