Wednesday, 25 June 2025 06:53:49 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Menstrual Leave: ఒడిశాలో ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌

Date : 16 August 2024 11:10 AM Views : 127

Studio18 News - జాతీయం / : ఒడిశాలో ప్ర‌భుత్వ, ప్రైవేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డి స‌ర్కార్ తీపి కబురు చెప్పింది. ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఉద్యోగినుల‌కు నెల‌స‌రి స‌మ‌యంలో తొలిరోజు లేదా రెండో రోజు సెల‌వు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప్ర‌భాతి ప‌రిడ వెల్ల‌డించారు. ఇది ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌లంద‌రికీ వ‌ర్తిస్తుంద‌న్నారు. గురువారం క‌ట‌క్‌లో జ‌రిగిన ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం ఈ మేర‌కు మీడియాతో మాట్లాడుతూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఉద్యోగినులు ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల‌ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే సామాజిక కార్య‌క‌ర్త న‌మ్ర‌తా చ‌డ్డా కూడా హర్షం వ్య‌క్తం చేశారు. మరోవైపు ప్రస్తుతం బీహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. ప్రభుత్వాలతో పాటు కొన్ని యూనివర్సిటీలు కూడా నెలసరి సెలవులను ప్రకటించాయి. వాటిల్లో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, తేజ్‌పూర్, అస్సాంలోని గువాహటి, చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీల విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి. ఇక జొమాటో వంటి ప్రైవేట్ సంస్థల్లోనూ మహిళలకు ఇలా సెలవులు ఇస్తున్నారు. ఏడాదికి పది పెయిడ్ పీరియడ్ లీవ్స్‌లను జొమాటో 2020 నుంచి అమలు చేస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా నెలసరి సెలవులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు. మహిళలకు నెలసరి సెలవులకు సంబంధించి 2022లోనే కేంద్రం ఓ బిల్లు తీసుకువచ్చింది. అయితే, ఆ బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :