Thursday, 22 May 2025 02:42:21 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

RG kar Hospital: కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి అవకతవకల్లో టీఎంసీ నేత హస్తం?

Date : 17 September 2024 04:02 PM Views : 119

Studio18 News - జాతీయం / : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచారం ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో అవకతవకలకు సంబంధించి పలు కొత్త పేర్లు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను అదుపులోకి తీసుకుంది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సందీప్‌ ఘోష్‌పై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే, రాష్ట్ర హెల్త్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ సుదీప్త రాయ్ పాత్ర కూడా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సుదీప్త రాయ్ ఇల్లు, ఆఫీసు, ఆయనకు చెందిన నర్సింగ్ హోంతో పాటు మొత్తంగా నాలుగు చోట్ల ఈడీ అధికారులు మంగళవారం సోదాలు చేస్తున్నారు. మరోవైపు, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ కేసుల్లో తమ పార్టీ నాయకులను ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల సూచనల మేరకే కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తున్నాయని మండిపడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :