Thursday, 22 May 2025 03:35:38 PM
# కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా

Bengal Doctors: కోల్‌క‌తా వైద్య విద్యార్థుల ఆందోళ‌న విర‌మ‌ణ‌.. కీల‌క ప్ర‌క‌ట‌న‌!

Date : 20 September 2024 11:39 AM Views : 115

Studio18 News - జాతీయం / : కోల్‌క‌తా ట్రైనీ వైద్యురాలిపై హ‌త్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టిన ఆర్‌జీ క‌ర్ వైద్య విద్యార్థులు 41 రోజుల త‌ర్వాత ఆందోళ‌న విర‌మించారు. రేప‌టి (శ‌నివారం) నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో పాల్గొంటామ‌ని తెలిపారు. బెంగాల్ ప్ర‌భుత్వంతో రెండు ద‌ఫాల చ‌ర్చ‌ల అనంత‌రం వైద్య విద్యార్థులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో వారి చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో విద్యార్థులు నిర‌స‌న‌ల‌ను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారి ప‌లు డిమాండ్ల‌కు ముఖ్య‌మంత్రి అంగీక‌రించారు. దీనిలో భాగంగా కోల్‌క‌తా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వినీత్ గోయ‌ల్‌ను త‌ప్పించి ఆయ‌న స్థానంలో మ‌నోజ్ కుమార్ వ‌ర్మ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలాగే మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ కౌస్త‌వ్ నాయ‌క్‌, హెల్త్ స‌ర్వీస్ డైరెక్ట‌ర్ దేవాశిష్ హ‌ల్డేర్‌ల‌ను వారి పోస్టుల నుంచి తొల‌గించ‌డం జ‌రిగింది. ఇక వైద్య విద్యార్థులు రెండో ద‌ఫాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధ‌వారం భేటీ అయ్యారు. అనంత‌రం త‌మ ఆందోళ‌న విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న చేశారు. "మా నిర‌స‌న విర‌మిస్తున్నాం. ఈ కేసును త్వ‌ర‌గా విచారించాల‌ని కోరుతూ గురువారం మ‌ధ్యాహ్నం సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేప‌డుతున్నాం. వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. రోగుల‌కు వైద్య సేవ‌లు అందించ‌డానికి శ‌నివారం నుంచి విధుల్లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో పాల్గొంటాం. అయితే, కోల్‌క‌తాలోని అన్ని మెడిక‌ల్ కాలేజీల వ‌ద్ద ధర్నా మంచాస్ అలాగే కొన‌సాగుతాయి" అని ఓ డాక్ట‌ర్ చెప్పుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :