Sunday, 25 January 2026 05:12:50 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

వయనాడ్ బాధితులపై మూగజీవాల ప్రేమ.. రాత్రంతా ఆశ్రయం ఇచ్చిన ఏనుగులు!

Date : 03 August 2024 04:08 PM Views : 426

Studio18 News - జాతీయం / : heartwarming incident: ఏనుగులను దగ్గరగా చూస్తే ఎవరికైనా భయమే. ఏం చేస్తాయోనని వణికిపోతాం. కానీ మూగజీవాలను చూసి అనవసరంగా భయపడాల్సిన పనిలేదు. మనుషుల కష్టాలను కూడా అవి అర్థం చేసుకుంటాయి. పాత రోజుల్లో మనం చాలా సినిమాల్లో చూసినట్టు కష్టాల్లో ఉన్న మనుషులను మూగప్రాణులు ఆదుకుంటాయి. అచ్చం ఇలాంటి అరుదైన ఘటనే కేరళలోని వయన్మాడ్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ దగ్గరకు వచ్చిన ఓ నానమ్మ, మనవరాలికి ఎటువంటి హానీ తలపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడాయి ఏనుగులు. అంతేకాదు వారికి బాధకు చలించిపోయి కన్నీళ్లు పెట్టాయట! అనూహ్యంగా బయటపడి.. వయన్మాడ్ ప్రళయంతో వయన్మాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇంతటి ఉత్పాతంలోనూ చురల్మలలో కుటుంబం అనూహ్యంగా బయటపడింది. సుజాత అనినంచిర అనే మహిళ ముండక్కైలోని హారిసన్స్ మలయాళం టీ ఎస్టేట్‌లోని తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు. తన భర్త కుట్టన్ తో కలిసి చురల్మలలో నివసిస్తున్నారు. వీరికి సమీపంలోనే సుజాత కుమారుడు.. తన భార్య, ఇద్దరు పిల్లలతో మరో ఇంట్లో ఉంటున్నాడు. జూలై 30 రోజు రాత్రి తన మనవరాలు మృదులతో కలిసి నిద్రపోయింది. జల విలయంతో కొండ చరియలు విరిగిపడడంతో వీరి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. అయితే ఈ ప్రమాదం నుంచి అనూహ్యంగా వారు ప్రాణాలతో బయటపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. “సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఏవో శబ్దాలు వినిపించడంతో అర్ధరాత్రి 1.15 అగంటల ప్రాంతంలో మెలకువ వచ్చింది. ఏంటని చూస్తే ఫ్లోర్ అంతా పగుళ్లు తీసింది. కొద్దిసేపటికే ఇంటి పైకప్పు కూడా కూలిపోయింది. ఛాతి వరకు శిథిలాల్లో చిక్కుకుపోయాను. అతికష్టం మీద శిథిలాల నుంచి బయటకు వచ్చాను. ఇంతలో నా మనవరాలు మృదుల ఆర్తనాదాలు వినిపించాయి. చాలా కష్టపడి ఎలాగోలాగ ఆమెను శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి బయటపడి ప్రవహించే నీటి గుండా ఈదుకుంటూ.. చివరికి సమీపంలోని కొండపైన ఉన్న తేయాకు తోటల్లోకి చేరుకున్నామ”ని ఆనాటి ఘటనను సుజాత గుర్తు చేసుకున్నారు. ఏనుగుల ఔదార్యం కొండపైకి ఎక్కిన తర్వాత వారికి ఎదురైన సీన్ చూసి భయంతో వణికిపోయారు. గండం గడిచిందన్న ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. ఎదురుగా ఏనుగుల గుంపు కనబడడంతో పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా అయింది వారి పరిస్థితి. అయితే జలప్రళయం నుంచి తప్పించుకుని చిమ్మ చీకటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన వారికి ఏనుగులు ఎటువంటి హాని తలపెట్టలేదు. అంతేకాదు తమ కాళ్ల దగ్గరే వారికి చోటిచ్చి మూగప్రేమ చాటాయి. “మేము కొండపైకి వెళ్లేటప్పటికి ఆ ప్రాంతమంతా చాలా చీకటిగా ఉంది. మాకు అర మీటరు దూరంలో ఒక ఏనుగు నిలబడి ఉంది. అది కూడా భయంగా కనిపించింది. దాంతో పాటు మరో రెండు ఆడ ఏనుగులు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడే విపత్తు నుండి బయటపడ్డాం, ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడే వరకు రాత్రంతా మాకు ఆశ్రయం కల్పించమని ఏనుగులను వేడుకున్నాను. మేము ఏనుగు కాళ్లకు చాలా దగ్గరగా ఉన్నాం. మా బాధను అర్థం చేసుకున్నాయేమో.. మమ్మల్ని ఏమీ చేయలేదు. ఉదయం 6 గంటల వరకు అక్కడే ఉన్నాం. సహాయ సిబ్బంది వచ్చి మమ్మల్ని కాపాడే వరకు ఏనుగులు కదలకుండా అలాగే నిలబడి ఉన్నాయి. వాటి కళ్లు చెమర్చడం నేను చూశాన”ని సుజాత మీడియాతో చెప్పారు. సుజాత, ఆమె మనవరాలు సురక్షితంగా బయటపడిన వైనాన్ని ఎక్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ షేర్ చేశారు. “కొండచరియలు విరిగిపడడంతో నిరాశ్రయులైన బాధితులు తమ కష్టాలను ఒక ఏనుగుతో చెప్పుకున్నారు. వారి కష్టాలు విని ఆ ఏనుగు కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు.. రాత్రంతా వారికి ఆశ్రయం కల్పించింద”ని ఆయన రాసుకొచ్చారు. ఈ సంఘటన గురించి తెలిసిన వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. మూగజీవాల ప్రేమను కొనియాడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :