Wednesday, 16 July 2025 11:38:33 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..?

Date : 22 May 2025 01:26 PM Views : 57

Studio18 News - జాతీయం / : ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ తో సైనిక ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. పాక్ మన నగరాలపై ప్రయోగించిన వందలాది డ్రోన్లను సైన్యం కూల్చివేసింది. అయితే, ఈ ఘర్షణపై మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వాడిట్టివార్‌ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ సైన్యం చైనా డ్రోన్లను ప్రయోగించగా మన సైన్యం క్షిపణులతో కూల్చివేసిందని అధికార వర్గాలు తెలిపాయని ఆయన గుర్తు చేశారు. చైనా డ్రోన్ల ఖరీదు ఒక్కొక్కటీ రూ.15 వేలకు మించదని, ఇలాంటి డ్రోన్లను కూల్చివేయడానికి రూ.15 లక్షలు విలువ చేసే క్షిపణులను ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నాగ్‌పుర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తర్వాత చోటుచేసుకున్న సైనిక ఘర్షణలో పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను నేలకూల్చినట్లు వివరించింది. అయితే, మనవైపు నుంచి జరిగిన నష్టంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పాక్ ప్రభుత్వం మన యుద్ధ విమానాలను కూల్చివేశామని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సైనిక ఘర్షణ సందర్భంగా మనవైపు చోటుచేసుకున్న నష్టం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?’’ అంటూ విజయ్ వాడిట్టివార్ ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :