Studio18 News - జాతీయం / : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. ఇక ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా అధికారులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఎన్టీకే పార్టీ చీఫ్ సీమాన్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తప్ప దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా? అని ఫైర్ అయ్యారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అంతేగాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయడం ఏంటని? మండిపడ్డారు. ఈ విషయంపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారని సీమాన్ చెప్పుకొచ్చారు.
Admin
Studio18 News