Wednesday, 16 July 2025 11:57:22 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Ayodhya: అయోధ్య రామ మందిరంపై జీఎస్టీ ఎన్ని కోట్లంటే...!

Date : 10 September 2024 04:23 PM Views : 127

Studio18 News - జాతీయం / : అయోధ్యలో బాల రాముడి మందిర నిర్మాణం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. సోమవారం అయోధ్యలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో చంపత్ రాయ్ మాట్లాడుతూ.. రామ మందిరం సహా 70 ఎకరాల్లో ట్రస్టు చేపట్టిన 18 ఆలయాల నిర్మాణంపై జీఎస్టీ రూపంలో కేంద్రానికి రూ.400 కోట్లు సమకూరుతుందని చెప్పారు. ఇది కేవలం అంచనా మాత్రమేనని, నిర్మాణాలు పూర్తయ్యాక ఆ మొత్తం ఇంకా పెరగవచ్చని వివరించారు. ఆలయాల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మినహాయింపులు ఆమోదించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మినహాయింపు కోరబోమని వెల్లడించారు. జీఎస్టీ పూర్తిగా వంద శాతం చెల్లిస్తామని తెలిపారు. రామమందిర నిర్మాణానికి ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు వచ్చాయని, ఒక దశలో విరాళాలు పంపించ వద్దంటూ విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. రామ భక్తులు పంపిన విరాళాలతో బాల రాముడి మందిరాన్ని విశాలంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఒక్కరోజే 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందిలేకుండా రామయ్యను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో ఎంతమంది భక్తులు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయన్నది నాకు తెలియదు. అయితే, రాముడి గుడి కోసం జరిగిన ఈ యజ్ఞం వెయ్యేళ్ల స్వాతంత్ర్య పోరాటానికి తక్కువేమీ కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం జరిగిందని చంపత్ రాయ్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :