Friday, 14 November 2025 01:31:36 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు శబ్ధాలు: ఆర్మీ అధికారులు

Date : 10 May 2025 05:53 PM Views : 185

Studio18 News - జాతీయం / : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ మరోసారి భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం 11.45 గంటల ప్రాంతంలో రెండు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని, దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయ పరిసరాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తక్షణమే స్పందించిన భద్రతా బలగాలు, పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశాయి. బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలలో ఉండకుండా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు, అవంతిపురా సమీపంలో కూడా ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని ప్రఖ్యాత దాల్ సరస్సులో క్షిపణిని పోలిన ఓ వస్తువు పడి ఉన్నట్లు గుర్తించామని వారు వివరించారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌ విమానాశ్రయం, ఎయిర్‌ బేస్‌ లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేయగా, భారత్ సైన్యం ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ వరుస పేలుళ్ల నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా శ్రీనగర్‌తో పాటు ఉత్తర, పశ్చిమ భారత్‌లోని మొత్తం 32 విమానాశ్రయాలను ఈ నెల 15వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :