Wednesday, 25 June 2025 06:31:08 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు శబ్ధాలు: ఆర్మీ అధికారులు

Date : 10 May 2025 05:53 PM Views : 65

Studio18 News - జాతీయం / : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ మరోసారి భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం 11.45 గంటల ప్రాంతంలో రెండు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని, దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయ పరిసరాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తక్షణమే స్పందించిన భద్రతా బలగాలు, పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశాయి. బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలలో ఉండకుండా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు, అవంతిపురా సమీపంలో కూడా ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని ప్రఖ్యాత దాల్ సరస్సులో క్షిపణిని పోలిన ఓ వస్తువు పడి ఉన్నట్లు గుర్తించామని వారు వివరించారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌ విమానాశ్రయం, ఎయిర్‌ బేస్‌ లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేయగా, భారత్ సైన్యం ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ వరుస పేలుళ్ల నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా శ్రీనగర్‌తో పాటు ఉత్తర, పశ్చిమ భారత్‌లోని మొత్తం 32 విమానాశ్రయాలను ఈ నెల 15వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :