Wednesday, 25 June 2025 07:24:44 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Narendra Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని నుంచి ఫోన్ కాల్ వచ్చింది: మోదీ

Date : 16 August 2024 05:52 PM Views : 141

Studio18 News - జాతీయం / : బంగ్లాదేశ్ లోని మైనార్టీలపై హింసాత్మక దాడులు కొనసాగుతుండటంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ దేశంలో ప్రస్తుతం రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ ఫోన్ కాల్ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిణామాలపై ఇద్దరం మాట్లాడుకున్నామని మోదీ వెల్లడించారు. ఆ దేశంలోని హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పిస్తామని మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారని తెలిపారు. శాంతియుత, సుస్థిర, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని చెప్పారు. మరోవైపు నిన్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుక సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అక్కడ ఉన్న హిందువులు, మైనార్టీల సురక్షితను భారత్ కోరుకుంటోందని తెలిపారు. యూనస్ కూడా ఇటీవల స్పందిస్తూ... మానవులంతా ఒక్కటేనని, హక్కులు అందరికీ సమానమేనని చెప్పారు. మతం ఏదైనా, ప్రజాస్వామ్యంలో మనుషులంతా ఒక్కటేనని అన్నారు. సంస్థాగత లోపాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :