Studio18 News - జాతీయం / : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతిచర్యగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ జరిపన దాడుల్లో 31 మంది మరణించారని, మరో 46 మంది గాయపడ్డారని పాకిస్థాన్ సైనిక ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు, పాకిస్థాన్ దళాలు గత 14 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. తాజాగా మే 7-8 తేదీల మధ్య జమ్మూకశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం చిన్న ఆయుధాలు, ఫిరంగి గుండ్లతో కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. పూంచ్లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్లో పౌరులు మృతి చెందడం, గురుద్వారా దెబ్బతినడం పట్ల శ్రీ అకాల్ తఖ్త్ జతేదార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "యుద్ధం మానవాళికి ఎప్పుడూ ప్రమాదకరమే. పాకిస్థాన్ షెల్లింగ్లో పౌరుల మృతిని, పూంచ్లోని గురుద్వారాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆయన ఒక పోస్ట్లో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని అకాల్ తఖ్త్ తాత్కాలిక జమేదార్ జియానీ కుల్దీప్ సింగ్ గర్గజ్ కోరారు.
Admin
Studio18 News