Wednesday, 25 June 2025 06:42:33 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Donald Trump: వెనెజులా నుంచి ఆయిల్ కొనే దేశాలకు ట్రంప్ వార్నింగ్

25 శాతం పన్నులు విధిస్తామని తేల్చిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా.. ఎలా కొన్నా సరే టారిఫ్ లు తప్పవని వెల్లడి భారత్, చైనాలపై పడనున్న

Date : 25 March 2025 12:36 PM Views : 81

Studio18 News - జాతీయం / : వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం నుంచి చమురు కానీ, గ్యాస్ కానీ కొనుగోలు చేసే దేశాలపై తాము 25 శాతం పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. వెనెజులా నుంచి చివరిసారిగా జరిపిన కొనుగోలు నుంచి ఏడాది వరకు ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ తో పాటు చైనాపైనా ప్రభావం పడనుంది. వెనెజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. 2024 జనవరిలో ఆ దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల్లో మెజారిటీ వాటా భారతదేశానిదే. రోజుకు దాదాపు 2.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. గతేడాది విదేశాల నుంచి కొనుగోలు చేసిన మొత్తం ముడి చమురులో 1.5 శాతం వెనెజులా నుంచే దిగుమతి చేసుకుంది. అలాగే చైనాకు కూడా రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్ ల ప్రభావం భారత్, చైనాలపై పడనుంది. ఎందుకీ నిర్ణయం.. ట్రంప్ ఇటీవల అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని యుద్ధ విమానాలలో వారి వారి స్వదేశాలకు పంపిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా వెనెజులా పౌరులు 200 ల మందిని ప్రత్యేక విమానాల్లో ట్రంప్ వాపస్ పంపించారు. దీనిపై మండిపడ్డ వెనెజులా.. ఇకపై అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అదేసమయంలో అమెరికాకు చమురు ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. వెనెజులా నిర్ణయంపై మండిపడ్డ ట్రంప్.. తాజాగా ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అలా కొనుగోలు చేస్తే ఆయా దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై 25 శాతం పన్నులు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :